ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల దూకుడు... 'సుస్థిర అభివృద్ధి'లో మూడో స్థానం

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో తెలుగు రాష్ట్రాలు మూడో స్థానంలో నిలిచాయి. శుద్ధ జలం, పారిశుద్ధ్య అంశాల్లో దేశంలోనే ఏపీ మేటిగా ఉండగా... ఆర్థిక ప్రగతి, అసమానతల తొలగింపులో తెలంగాణకు అగ్రస్థానం లభించింది.

By

Published : Dec 31, 2019, 9:07 AM IST

Telugu states are in third place in achieving sustainable development goals
దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు... సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మూడో స్థానం

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ - ఎస్‌డీజీ) సాధనలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ దూసుకుపోతున్నాయి. తమిళనాడుతో కలిసి తెలుగు రాష్ట్రాలు మూడో స్థానంలో నిలిచాయి. కేరళ ప్రథమ స్థానాన్ని, హిమాచల్‌ ప్రదేశ్ రెండో స్థానాన్ని పొందాయి. ఎస్‌డీజీ భారత సూచికలు-2019 పేరుతో నీతి ఆయోగ్‌ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడయింది. లక్ష్య సాధనలో కేరళకు 70 మార్కులు; హిమాచల్‌కు 69; ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడులకు 67 మార్కుల వంతున వచ్చాయి. బిహార్‌, ఝార్ఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లు అట్టడుగున నిలిచాయి. 2030 నాటికి సాధించాల్సిన ప్రగతి పేరుతో ఐక్యరాజ్యసమితి ఈ లక్ష్యాలను రూపొందించింది. గత అయిదేళ్లుగా భారత్‌ వీటి సాధనకు కృషి చేస్తూ ప్రతి ఏటా మదింపు జరుపుతోంది.

  • దేశం మొత్తం వివరాలను పరిశీలించినప్పుడు లక్ష్యాల సాధనలో భారత్‌కు 60 మార్కులు వచ్చాయి. గత ఏడాది 57 మార్కులే రాగా, ఈ సారి 3 మార్కులు పెరగడం విశేషం.
  • తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశ్రమలు, నవకల్పనల రంగాల్లో పరిస్థితులు మెరుగవడమే ర్యాంకు పెరుగుదలకు దోహదపడింది.
  • పౌష్టికాహారం, స్త్రీ-పురుష సమానత్వం ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంది.
  • పేదరికం నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, సిక్కింల పనితీరు బాగుంది.

శుద్ధ జలంలో రాష్ట్రమే మేటి...

శుద్ధజలం, పారిశుద్ధ్యం అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మేటిగా ఉంది. 100కుగానూ 96 పాయింట్లు సాధించింది.

  • 97.40% ఇళ్లకు మెరుగైన విధానాల ద్వారా మంచినీరు అందుతోంది.
  • ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.
  • బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ (ఓడీఎఫ్‌) పథకం కింద ప్రతి జిల్లాలోనూ తనిఖీలు జరిగాయి.
  • 99.8 శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి.
  • 95.14% పరిశ్రమలు సొంతంగా మురుగునీటి శుద్ధి సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాయి.

ఆర్థిక ప్రగతి, అసమానతల తొలగింపులో తెలంగాణకు అగ్రస్థానం

ఆర్థిక ప్రగతి/ యోగ్యమైన పని అన్న లక్ష్య సాధనలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం ఏడు అంశాలను పరిశీలించి లెక్కించగా తెలంగాణకు 82 పాయింట్లు వచ్చాయి. 78 పాయింట్లు సాధించిన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలు రెండో స్థానాన్ని పొందాయి. నికర జాతీయ ఉత్పత్తి (ఎన్‌డీపీ) వృద్ధి తెలంగాణలో 8.89 శాతంగా, ఆంధ్రప్రదేశ్‌లో 10.07 శాతంగా నమోదయింది.

  • సాంఘిక అసమానతల తొలగింపులో దేశంలో తెలంగాణాయే ముందంజలోఉంది. ఈ విషయంలో ఏకంగా 94 పాయింట్లు సాధించింది. 2019లో అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సభ్యుల సంఖ్య; 2015-16లో ట్రాన్స్‌జెండర్లకు లభించిన ప్రాధాన్యం; 2013-14 మధ్య కాలంలో ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించిన నిధుల వినియోగం ఆధారంగా ఈ మార్కులు ఇచ్చారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్‌ 68 పాయింట్లతో 12వ ర్యాంకులో నిలిచింది.
  • మంచినీటి సౌకర్యం కల్పనలో తెలంగాణ చాలా ముందుంది. పారిశుద్ధ్యంలో వెనుకబడింది.

ఇవీ చూడండి:

ఆగ్రహావతి : 14వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల దీక్షలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details