ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CJI: సీజేఐగా తెలుగు వ్యక్తి... ఎంతో గర్వకారణం: తెలుగు కవులు - Rajbhavan news

రాజ్​భవన్​లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను తెలుగు కవులు, రచయితలు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని కొనియాడారు.

CJICJI
CJI

By

Published : Jun 16, 2021, 9:18 PM IST

సీజేఐగా తెలుగు వ్యక్తి... ఎంతో గర్వకారణమన్న తెలుగు కవులు

హైదరాబాద్‌లోని రాజ్​భవన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Nv Ramana)ను తెలుగు కవులు, రచయితలు మర్యాదపూర్వకంగా కలిశారు. సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిరోహించిన జస్టిస్ ఎన్వీ రమణ(Nv Ramana)కు అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్, సినీ గేయ రచయితలు.... జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సుద్దాల అశోక్ తేజ సహా పలువురు రచయితలు, కవులు శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. భూ మండలానికి న్యాయం అందించేందుకు సర్వోన్నత పీఠాన్ని జస్టిస్ రమణ అధిరోహించారంటూ.... జొన్నవిత్తుల తనదైన శైలిలో పద్యాన్ని వినిపించారు.

ఇదీ చదవండి:అయ్యా... మాబోటి ముసలోళ్ల కోసం కూడా కాస్త పని చేయండయ్యా..!

ABOUT THE AUTHOR

...view details