ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతికి మద్దతుగా అండమాన్​లో నిరసన

By

Published : Oct 10, 2020, 11:55 PM IST

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అండమాన్​లో తెదేపా శ్రేణులు నిరసన దీక్ష నిర్వహించారు. అమరావతి రైతుల త్యాగాల్ని వైకాపా ప్రభుత్వం వంచించిందని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రజలకు చేసిందేమీ లేదని ఆక్షేపించారు.

tdp protest in andaman
tdp protest in andaman

అమరావతికి మద్దతుగా అండమాన్​లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన దీక్ష చేపట్టారు. దేశంలో ఎక్కడాలేని మూడు రాజధానుల విధానం తీసుకొచ్చి... ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని స్థానిక తెెదేపా నేతలు విమర్శించారు. విశాఖలో భూములు దోచుకోవడానికి అమరావతి రైతుల త్యాగాల్ని వంచించారని మండిపడ్డారు.

రైతులకు కౌలు ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ చేసిందేమీ లేదన్నారు. తక్షణమే ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగించి రైతుల త్యాగాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. అండమాన్ నికోబార్ తెదేపా అధ్యక్షుడు మాణిక్యాలరావు, ఉపాధ్యక్షుడు బి. వెంకటేశ్వరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details