Bipin Rawat Relation With Hyderabad : భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం భాగ్యనగరవాసుల్ని తీవ్రంగా కలిచివేసింది. వీరితో పాటు మరో 12 మంది సైనిక అధికారులు మృత్యువాత పడిన ఘటన అందర్ని ఒక్కసారిగా నిశ్చేష్టులను చేసింది. ఆర్మీ చీఫ్గా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హోదాల్లో ఆయన పలుమార్లు హైదరాబాద్లోని వైమానిక, సైనిక శిక్షణ కేంద్రాలను సందర్శించారు. పాసింగ్ అవుట్ పరేడ్లలో పాల్గొన్నారు. వ్యక్తిగతం కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలని చెప్పేవారు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేశమే మొదటిది కావాలని చెప్పేవారు.. నగరంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. రాజకీయ నాయకులు, సినిమా తారలకు మాదిరి.. రావత్ సైతం తన ధైర్య సాహసాలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.
Bipin Rawat Death News : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్తో పాటు ఆయన సతీమణి, సైన్యాధికారులను కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కెప్టెన్ వరుణ్సింగ్ వేగంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ఒవైసీ పేర్కొన్నారు.
నగరానికి ఎప్పుడెప్పుడు వచ్చారు?
- Bipin Rawat Died in Helicopter Crash :2018 డిసెంబరు 14: చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హోదాలో జనరల్ బిపిన్ రావత్ సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. 27 మంది అధికారులకు ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేశారు. తెలంగాణ అండ్ ఆంధ్రా సబ్ ఏరియా(టాసా) ప్రధాన కార్యాలయంలో సైనిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఎంఈ గ్రంథాలయాన్ని సందర్శించారు.
- 2017 సెప్టెంబరు 17: దుండిగల్లోని భారత వాయుసేన అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- 2016 జనవరి 15: సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో సికింద్రాబాద్లో జరిగిన ఆర్మీ డే వేడుకలో పాల్గొన్నారు.
- బేగంపేట, బంజారాహిల్స్లో జరిగిన వివిధ సదస్సులకు ఆయన హాజరయ్యారు.
చిరునవ్వే ఆయన చిరునామా