ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని తెలంగాణ కేడర్లోకి తీసుకుంటూ టీఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జీవో 583 జారీ చేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర సర్కారు నివేదించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించిన అభిషేక్... తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు.
వాదనలు విన్న క్యాట్... అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అభిషేక్ మొహంతిని విధుల నుంచి రిలీవ్ చేయాలని అటు ఏపీని.. విధుల్లో చేర్చుకోవాలని ఇటు తెలంగాణను ఆదేశించింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసినప్పటికీ.. విధుల్లోకి చేర్చుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో తెలంగాణ సీఎస్పై అభిషేక్ మహంతి ట్రైబ్యునల్లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఇవాళ(మార్చి 15) వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.