ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆదాయ మార్గాలపై తెలంగాణ సర్కార్ దృష్టి! - Telangana Government

కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై తెలంగాణ సర్కారు కసరత్తు వేగవంతం చేస్తోంది. హెచ్​ఎండీఏ, టీఎస్​ఐఐసీ భూముల వేలానికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అటు రుణపరిమితిని 5 శాతానికి పెంచాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు ఇతర అవకాశాలపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

telangana-government-exercise-on-ways-to-increase-revenue
ఆదాయం పెంచుకునే మార్గాలపై సర్కార్ దృష్టి

By

Published : Jun 17, 2021, 7:20 AM IST

కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేస్తోంది. ఒక్క మే నెలలోనే రూ.4,100 కోట్లు ఆదాయాన్ని కోల్పోయినట్లు ఇటీవల కేంద్రానికి తెలిపింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం, గృహనిర్మాణ సంస్థ వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.

హెచ్​ఎండీఏ, టీఎస్​ఐఐసీ భూముల వేలానికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అటు రుణపరిమితిని 5 శాతానికి పెంచాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు ఇతర అవకాశాలపై కూడా ఆ రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిధుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశం కానుంది.

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు కేటీఆర్​, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు అధికారులు సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. గృహానిర్మాణ సంస్ధ పరిధిలోని భూములు, ఇండ్ల విక్రయం సహా ఇతర అంశాలపై ఉపసంఘం చర్చించనుంది.

ఇదీ చూడండి:

MP Raghurama case: గుంటూరు జిల్లా జైలు అధికారులకు సీఐడీ కోర్టు మెమో!

ABOUT THE AUTHOR

...view details