తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు అక్రమాస్తుల కేసులో భారీగా బంగారాన్ని ఏసీబీ సీజ్ చేసింది. నాగరాజు బంధువైన నందగోపాల్కు సంబంధించిన లాకర్లో 1256 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించారు. తనిఖీల్లో భాగంగా నాగరాజు దంపతులు నందగోపాల్ లాకర్ను బినామీ లాకర్గా ఉపయోగించే వారని అధికారులు నిర్ధరించారు.
మాజీ తాహసీల్దార్ నాగరాజు అక్రమాస్తుల కేసు-లాకర్లో భారీగా బంగారం - నాగరాజు
తెలంగాణ రాష్ట్రంలోని కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు అక్రమాస్తుల కేసులో భాగంగా ఏసీబీ అధికారులు అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంకులో లాకర్లను తెరిచారు. నాగరాజు బంధువైన నందగోపాల్కు సంబంధించిన లాకర్లో 1256 గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తించారు.
![మాజీ తాహసీల్దార్ నాగరాజు అక్రమాస్తుల కేసు-లాకర్లో భారీగా బంగారం Telangana: Former Tasildar Nagraj illegal property case- heavily gold found in locker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9270729-842-9270729-1603359111024.jpg)
తెలంగాణ: మాజీ తాసీల్దార్ నాగరాజు అక్రమాస్తుల కేసు-లాకర్ లో భారీగా బంగారం గుర్తింపు
తమకు తెలియకుండానే నాగరాజు దంపతులు లాకర్లో బంగారు ఆభరణాలను దాచినట్లు నందగోపాల్ తెలిపారు. లాకర్లో ఉన్న పసిడి విలువ రూ. 65 లక్షలు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి:జేబులు నింపుకునేందుకే భారీ జరిమానాలు : అచ్చెన్నాయుడు