ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 7, 2020, 11:23 PM IST

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1122కుచేరింది. 45 మంది కొవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడం ఊరట కలిగించే అంశం.

15 Corona positive cases in Telangana
తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 12 మంది వైరస్​ బారినపడ్డారు. జాబితాలోని బాధితుల్లో ముగ్గురు మైగ్రంట్స్​గా ప్రభుత్వం పేర్కొంది. వీరు ముగ్గురు మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1122కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా కరోనా నుంచి కోలుకుని 693 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. 400 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details