ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ నుంచి మావోయిస్టులకు నగదు - naxals latest news

telangana contractors booked in gadchiroli for providing cash to naxals
తెలంగాణ నుంచి మావోయిస్టులకు నగదు

By

Published : Jun 4, 2020, 11:08 AM IST

Updated : Jun 4, 2020, 11:47 AM IST

10:59 June 04

తెలంగాణ నుంచి మావోయిస్టులకు నగదు

తెలంగాణ నుంచి మావోయిస్టులకు నగదు, రూ.2కోట్లు స్వాధీనం

          తెలంగాణ రాష్ట్రానికి చెందిన  కాంట్రాక్టర్లు... మావోయిస్టులకు నగదు అందించేందుకు వెళ్తుండగా మహారాష్ట్రలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 2కోట్ల 20లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కాంట్రాక్టర్లతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.         

   తెలంగాణ నుంచి వచ్చిన ఓ అనుమానాస్పద కారును మహారాష్ట్ర సిరోంచా పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తోన్న రూ.2 కోట్ల 20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కాంట్రాక్టర్లతోపాటు డ్రైవర్, క్లీనర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గడ్చిరోలిలోని నక్సల్స్​కు సాయం అందిస్తున్నట్లు వారిపై అభియోగాలు ఉన్నాయి.

 ఓ కాంట్రాక్టర్​ నుంచి అవతారే, రౌత్​ డబ్బులు సేకరించి నక్సల్స్​కు అందిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు సిరోంచా పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది.

ఇదీ చదవండి: 

పచ్చని పల్లెలకు పాకుతున్న కరోనా

Last Updated : Jun 4, 2020, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details