Padma sri Ramachandraiah: డోలు వాయిద్యంలో ప్రత్యేక ప్రతిభ చాటి పద్మశ్రీ అవార్డు సాధించిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ నజరానా ప్రకటించారు. ఆయన జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణ ఖర్చుకు కోటి రూపాయల రివార్డును ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న నేపథ్యంలో రామచంద్రయ్య సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు ఆయన్ను అభినందించిన ముఖ్యమంత్రి.. జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు పొందడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రయ్య యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్... ఇంటిస్థలం, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును ఆదేశించారు.