ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ సీఎం​కు బండి సంజయ్​ లేఖ.. ఎందుకంటే..? - ముఖ్యమంత్రి కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ

Bandi Sanjay Letter To KCR: పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీసును క్రమబద్దీకరించాలని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు.

Bandi Sanjay Letter To KCR
Bandi Sanjay Letter To KCR

By

Published : Feb 18, 2022, 7:13 PM IST

Bandi Sanjay Letter To KCR: తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారుల వేధింపులు నిత్యకృత్యంగా మారాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. వారిలో మనోధైర్యం నింపి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీసును క్రమబద్దీకరించాలని డిమాండ్​ చేస్తూ.. సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ రాశారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ, దోమల నివారణ సహా పలు కార్యక్రమాలు వీరి చేతులమీదుగానే జరుగుతాయి. ఈ సమయంలో వారికి కచ్చితమైన పని గంటల నిర్ణయించడంతోపాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి :Tidco Houses: టిడ్కో ఇళ్లపై సీఎం జగన్ మాటతప్పి మడమ తిప్పారు: తెదేపా

ABOUT THE AUTHOR

...view details