ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: హేమంత్ కు కన్నీటి వీడ్కోలు - చందానగర్‌ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు

పరువు హత్యకు గురైన హేమంత్‌ అంత్యక్రియలు కుటుంబ సభ్యుల కన్నీటి నివాళులతో ముగిశాయి. హైదరాబాద్ చందానగర్‌ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

Telangana: A tearful farewell to Hemant
తెలంగాణ: హేమంత్ కు కన్నీటి వీడ్కోలు

By

Published : Sep 26, 2020, 7:28 PM IST

తెలంగాణ: హేమంత్ కు కన్నీటి వీడ్కోలు

హైదరాబాద్ లోని చందానగర్​లో పరువు హత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి. లండన్‌లో ఉంటున్న అతని సోదరుడు హైదరాబాద్‌ వచ్చారు. ఇంటి దగ్గర హేమంత్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. భార్య, తల్లిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు.

పోలీసుల భద్రత మధ్య.. అంతిమయాత్ర సాగింది. బంధువులు, కాలనీవాసులు హాజరయ్యారు. శోకసంద్రంలో యాత్ర సాగింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబం వేడుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న హేమంత్​ను ఆయన మామ, కుటుంబసభ్యులు కిరాయి గుండాలతో కలిసి రెండురోజుల క్రితం దారుణంగా హత్యచేశారు. పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details