ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'స్థానికం' ఎన్నికల వాయిదాపై తెదేపా - వైకాపా మాటల యుద్ధం - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై వైకాపా నేతలు ఎస్ఈసీ తీవ్రస్థాయిలో మండపడ్డారు. ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే చంద్రబాబుకు అనుకూలంగా ఎస్​ఈసీ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా నేతలు స్పందిస్తున్న తీరును తెదేపా నేతలు తప్పుబట్టారు. నామినేషన్లు, విత్ డ్రాలు అయిపోయాక వాయిదా పడిన ఎన్నికలపై విరుచుకుపడడం విడ్డూరమన్నారు.

cement-tdp ysrcp fighting on local body electionsrates
cement-rtdp ysrcp fighting on local body electionsates

By

Published : Mar 17, 2020, 2:19 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై తెదేపా - వైకాపా మాటల యుద్ధం

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ రమేశ్‌కుమార్‌పై వైకాపా నేతలు ఆరోపణలు గుప్పించారు. తన పరిధి మరిచి ఎస్ఈసీ వ్యవహరించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసిన రమేశ్‌కుమార్‌.... రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడలేదని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. అనుమానాలు వచ్చేలా ఎస్ఈసీ వ్యవహరించారని మంత్రి పేర్ని నాని ఆగ్రహించారు.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై తెదేపా - వైకాపా మాటల యుద్ధం

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై వైకాపా నేతలు స్పందిస్తున్న తీరును, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేశ్‌ కుమార్‌పై చేసిన ఆరోపణలను.... తెలుగుదేశం నేతలు తప్పుబట్టారు. నామినేషన్లు, విత్ డ్రాలు అయిపోయిన తర్వాత... ఎన్నికల వాయిదాపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘాన్ని రద్దు చేసే అధికారం సీఎం జగన్‌కు లేదని, ఉంటే ఈ పాటికే ఈసీ ని రద్దు చేసేవారని బుచ్చయ్యచౌదరి ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details