రాజధానిపై కుట్రలను బయటపెట్టేందుకే అమరావతి పర్యటనకు వెళ్తున్నట్లు తెదేపా ఎమ్మెల్యేలు చినరాజప్ప, అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ పెద్దలు తమతో అమరావతి పర్యటనకు వస్తే.. గత ఐదేళ్ల అభివృద్ధిని వారికి చూపిస్తామని తెదేపా ఎమ్మెల్యేలు, నేతలు సవాలు విసిరారు. తమపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తమని తెలిపారు.