ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉద్యోగులను రెచ్చగొడుతున్న మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలి' - మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి డిమాండ్

స్థానిక సంస్థల ఎన్నికలకు ఉద్యోగుల సహకారంపై పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలను తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసి.. రాజ్యాంగస్పూర్తికి వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

tdp leader sudhakar reddy demands for minister peddireddy bartharaf
మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని తెదేపా నేత సుధాకర్ రెడ్డి డిమాండ్

By

Published : Jan 23, 2021, 7:23 PM IST

సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఈసీకి ఉద్యోగులు సహకరించరని చెబుతున్న పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని.. తక్షణం బర్తరఫ్ చేయాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్​కు.. వ్యతిరేకంగా పని చేయమని ఉద్యోగులను పరోక్షంగా రెచ్చగొడుతున్న ఆయనపై కుట్ర కేసు పెట్టాలని ఎస్ఈసీని కోరారు. రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసిన మంత్రే.. రాజ్యాంగస్పూర్తికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని నేరంగా పరిగణించాలన్నారు.

దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని మంత్రి ప్రశ్నించడాన్ని సుధాకర్ రెడ్డి ఆక్షేపించారు. వేలాది మందితో ఊరేగింపులు చేస్తున్న నాయకులకు.. ఎన్నికలనగానే కరోనా గుర్తుకు రావడం విడ్డూరమని మండిపడ్డారు. ఎన్నికల పేరు చెప్పగానే భయపడుతున్న రామచంద్రారెడ్డి.. కొందరు నిమ్మగడ్డతో కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details