ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2020, 9:08 AM IST

ETV Bharat / city

విశాఖ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై చంద్రబాబు, లోకేశ్​ దిగ్భ్రాంతి

విశాఖ ఫార్మా సిటీలో అగ్నిప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా దృశ్యాలు తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. కార్మికులంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.

విశాఖ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై చంద్రబాబు, లోకేశ్​ దిగ్భ్రాంతి
విశాఖ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై చంద్రబాబు, లోకేశ్​ దిగ్భ్రాంతి

చంద్రబాబు ట్వీట్​

విశాఖ ఫార్మా సిటీలో పేలుడు గురించి తెలిసి షాక్‌కు గురైనట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ఘటనా దృశ్యాలు భయంకరంగా కనిపించాయన్న ఆయన.. కార్మికులు అంతా సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

లోకేశ్​ ట్వీట్​

విశాఖపట్నం ఫార్మా సిటీలో పేలుడు దృశ్యాలు బాధ కలిగించాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ప్రమాద బాధితులకు అధికారులు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కార్మికులకు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details