ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 1, 2020, 8:25 PM IST

ETV Bharat / city

అబద్ధాలతో సీఎం ప్రజలను మాయ చేస్తున్నారు: అచ్చెన్న

స్వార్థం కోసం వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. హామీలపై ప్రశ్నించే బలహీనవర్గాలను కేసులతో వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp president atchennaidu
tdp president atchennaidu

రాష్ట్రావతరణ రోజు కూడా సీఎం జగన్​ అబద్ధాలతో ప్రజలను మాయ చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు. హామీలపై ప్రశ్నించే బలహీనవర్గాలను కేసులతో వేధిస్తున్నారని ఆక్షేపించారు.730కు పైగా పోస్టులను సొంత సామాజికవర్గానికి ఇచ్చారని ఆరోపించారు. కులాల కలుపుమొక్కలు పెంచింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని సీఎం ఎందుకు ఖండించలేదని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details