మద్యనిషేధం పేరిట దశలవారీ దోపిడీకి శ్రీకారం : పంచుమర్తి అనురాధ మద్య నిషేధం ముసుగులో జె-టాక్స్ పేరిట రూ.2 వేల కోట్ల దోపిడీకి జగన్ శ్రీకారం చుట్టారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అమరావతిలో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వం అమలు చేస్తోన్న మద్యపాన నిషేధం ఓ నాటకమని విమర్శించారు. పులివెందులలో మద్యం ఏరులై పారుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో 20శాతం మద్యం దుకాణాలు తగ్గించామని ప్రభుత్వం చెప్పటం హాస్యాస్పదమన్నారు. మద్యం మాఫియాను పెంచి పోషించేలా సర్కారు చర్యలు ఉన్నాయని అనురాధ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ బ్రాండ్ మద్యం అమ్మాలో కేసీఆర్ని అడిగి జగన్ నిర్ణయిస్తారని ఎద్దేవా చేశారు. దశలవారీగా మద్య నిషేధం పేరిట దశలవారీగా దోచుకునేందుకు ప్రణాళికలు చేసుకున్నారని ఆమె మండిపడ్డారు.
ఇదీ చదవండి :