ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మూడు రాజధానుల ప్రతిపాదనను అడ్డుకోండి'

మూడు రాజధానుల ప్రతిపాదనను అడ్డుకోవాలని కోరుతూ... ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాకు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. 3 రాజధానులను అంగీకరిస్తే విభిన్న రాజధానులు కావాలనే డిమాండ్లు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. మండలి రద్దుపైనా సమీక్షించాలని కోరారు.

By

Published : Feb 14, 2020, 10:05 PM IST

tdp mp kanakamedala
tdp mp kanakamedala

మూడు రాజధానుల నిర్ణయంతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. 13 జిల్లాలు ఉన్న రాష్ట్రానికి 3 రాజధానులు అంగీకరిస్తే... విభిన్న రాజధానులు కావాలనే డిమాండ్లు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా చూడాలని విన్నవించారు. విభజన చట్టం ప్రకారం ఇప్పటికే అమరావతి రాజధానిగా ఖరారైందని... తన పరిధిలో లేని అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని కనకమేడల లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశం, దుస్సాహసంతో కూడిన మూడు రాజధానుల ప్రతిపాదనను ఇప్పుడు అడ్డుకోకపోతే... దేశంపై తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుందని లేఖలో ప్రస్తావించారు.

మండలిపై ఆలోచించండి

మండలి రద్దు అంశంపైనా లేఖలో కనకమేడల వివరించారు. తన నిర్ణయాలకు మద్దతుగా లేదనే ఉద్దేశంతోనే శాసనమండలి రద్దుకు సీఎం జగన్ బిల్లు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రాలు తమ ఇష్టారీతిగా మండలి ఏర్పాటు, రద్దు చేయడం మంచిది కాదని స్థాయి సంఘం చెప్పిన విషయం గుర్తుచేశారు. ఇప్పటికే శాసనమండలి విషయంలో పలు రాష్ట్రాల విజ్ఞప్తులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మండలి రద్దుపై సమీక్షించాలని కోరారు.

ఇదీ చదవండి

దిల్లీ యాత్ర చేపట్టే యోచనలో అమరావతి రైతులు

ABOUT THE AUTHOR

...view details