కరోనా రెండో దశలో ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం జగన్ విస్మరించారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. సచివాలయంలోనే నలుగురు ఉద్యోగులు చనిపోవటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలన్నారు.
'ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం విస్మరించారు'
కరోనా కారణంగా నలుగురు సచివాలయ ఉద్యోగులు మృతి చెందడం బాధాకరణని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం జగన్ విస్మరించారని ఆరోపించారు.
tdp mlc ashok babu comments on ysrcp government