ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శానిటైజర్​ తాగి చనిపోవడానికి ప్రభుత్వమే కారణం: తెదేపా నేతలు - శానిటైజర్​ మరణాలపై స్పందించిన ఎమ్మెల్సీ బుద్ధా వెంక

సీఎం జగన్​ మద్యం రూపంలో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని.. తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని సవాలు విసిరారు. శానిటైజర్ తాగి చనిపోయిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీమంత్రి జవహర్ దుయ్యబట్టారు. మద్యం ధరలు పెంచి మహిళల.. తాళిబొట్లు తెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP leaders
శానిటైజర్లు తాగి చనిపోతున్న ఘటనలపై స్పందించిన తెదేపా నేతలు..

By

Published : Mar 23, 2021, 12:28 PM IST

శానిటైజర్లు తాగి చనిపోతున్న ఘటనలపై స్పందించిన తెదేపా నేతలు..

ముఖ్యమంత్రి జగన్‌ విధానాల వల్ల పేద ప్రజలు బలవుతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ప్రజలు శానిటైజర్లు తాగి చనిపోవటానికి ప్రభుత్వమే కారణమన్నారు. మద్యపానం నిషేధం పేరిట ధరలు పెంచటం సరైన నిర్ణయం కాదన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని లేదా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ధరల ఆధారంగా రాష్ట్రంలో అమ్మకాలు జరపాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో శానిటైజర్ తాగి చనిపోయిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. పెరిగిన మద్యం ధరల కారణంగా పేదలు తమ రోజు కూలీ మొత్తం మద్యానికే ఖర్చు చేస్తూ కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్​, నాటుసారా తాగి.. 50మంది చనిపోయారని విమర్శించారు. వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ..భారత్ బంద్​కు తెదేపా మద్దతు: అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details