TDP on Amaravati: రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై తెలుగు వర్క్షాప్లో తెదేపా నేతలు దేవివేని ఉమా, బచ్చుల అర్జునుడు నేతృత్వంలో రైతు కమిటీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు సీఎం జగన్కు చెంపపెట్టు అని దేవినేని అన్నారు. మూడు రాజధానుల డ్రామాకు తెరపడిందని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి గ్రాఫిక్స్ ముగిసిందని విమర్శించిన బూతుల మంత్రులు క్షమాపణ చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
TDP Leaders: రాజధాని అంశం పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పారు. హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని మరో అప్పీల్కు వెళ్లొద్దన్నారు. రాజధాని భూములు అభివృద్ధి చేసి ప్రభుత్వం రైతులకు అప్పగించాలి తెలిపారు. డివిజన్ బెంచ్ తీర్పును యథాతథంగా అమలు చేయాలని చెప్పారు.
TDP Leaders: రాజధాని తీర్పు.. అమరావతి రైతుల విజయమని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. రాజధాని అంశంలో తెదేపా వాదనే నిజమైందని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. విభజన చట్టాన్ని పార్లమెంట్ చేసిందని.. రాష్ట్రపతి ఆమోద ముద్ర గుర్తుచేశారు.