అమరావతి ఉద్యమం 400వ రోజు ఆందోళనలకు మద్దతిచ్చిన కృష్ణా జిల్లా తెలుగుదేశం నేతలను.. పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఇంటి నుంచి బయటికి రానివ్వలేదు. పోలీసు చర్యలను తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం.. పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి ఆందోళనలు.. తెదేపా నేతల గృహ నిర్బంధం
అమరావతి ఉద్యమం 400వ రోజు సందర్భంగా రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతిచ్చిన తెదేపా నేతలను... పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను గృహ నిర్బంధం చేశారు.
తెదేపా నేతల గృహనిర్బంధం