ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 12, 2021, 9:47 PM IST

ETV Bharat / city

ప్రభుత్వపరంగా ప్రోటోకాల్ పాటించకపోవడం సభ్యతేనా?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి పర్యటనలో ప్రభుత్వపరంగా ప్రోటోకాల్ పాటించలేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. అధిక పన్నులతో ప్రజలపై ప్రభుత్వం భారాన్ని మోపుతోందని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి బెయిల్ రద్దుపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై లేదని విమర్శించారు.

tdp leaders
తెదేపా నేతల ధ్వజం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుపతి పర్యటనకు వస్తే ప్రభుత్వపరంగా ప్రోటోకాల్ కూడా పాటించకపోవటం సభ్యతేనా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. ప్రభుత్వపరంగా గౌరవం ఇవ్వకుండా పైపెచ్చు ప్రతిపక్షాలను నిందించటం దుష్టరాజకీయమని బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. ఇది ఆమోదయోగ్యమైన విషయమేనా అని గోరంట్ల ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్లు వైకాపా నేతల వ్యవహరం ఉందని దుయ్యబట్టారు. తెలుగువాడు గర్వపడేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావటం గర్వకారణమని తెలుగుజాతి చెప్పుకుంటోందని గుర్తు చేశారు.

'జుట్టు' పన్నుకూ ప్రజలు సిద్ధం కావాలి: మాజీ మంత్రి జవహర్

పాలనలో తుగ్లక్​ను, పన్నుల వసూళ్లలో కుతుబుద్దీన్ ఐబక్ చరిత్రను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ దుయ్యబట్టారు. ప్రజలపై ఇప్పటికే నీరు, ఆస్తి, విలువ ఆధారిత పన్నుల భారం మోపగా.. ఇక మిగిలిన 'జుట్టు' పన్నుకూ ప్రజలు సిద్ధం కావాలని మండిపడ్డారు. బెయిల్ రద్దుపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై లేదని విమర్శించారు.

రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా అమ్మకాలు, తాకట్టులపైనే దృష్టి పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మాదిగల పథకాలను గాలికొదిలేసి మాల కార్పొరేషన్ మనుగడ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెల్లి కార్పొరేషన్ ఉనికి లేకుండా చేయటంతో ఎస్సీ కార్పొరేషన్లు పేరుకే మిగిలాయని ధ్వజమెత్తారు. మోసపు వాగ్దానాలతో జగన్ రెడ్డి చేస్తున్నకాలక్షేపం రాష్ట్రానికి శాపంగా మారిందని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

పార్టీ నుంచి అధినేత నన్ను బహిష్కరించారా..?: ఎంపీ రఘురామ

ఆకలి తీర్చిన అమ్మతనం.. పందిపిల్లలకు గోమాత పాలు

ABOUT THE AUTHOR

...view details