TDP leader Yanamala: ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రాధాన్యతను తగ్గించే కుట్ర సీఎం జగన్ రెడ్డి చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రభుత్వ చేతగాని పాలనను ప్రతిపక్షాలు చట్టసభలో నిలదీస్తాయని జగన్ రెడ్డికి భయమని ఆయన అన్నారు. శాసనసభలు విధిగా నిర్వహించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. ఏడాదికి సగటున 25 రోజులు మించి చట్టసభలు నిర్వహించలేదన్న యనమల... గత ఏడాది కేవలం 15 రోజులు మాత్రమే నిర్వహించారన్నారు. వ్యవసాయం నుంచి సంక్షేమం వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రతిపక్ష పార్టీ ఎండగడుతుందన్న భయంతోనే తక్కువ రోజులు సమావేశాన్ని నిర్వహిస్తున్నారన్నారు.
Yanamala: చట్టసభల ప్రాధాన్యం తగ్గించేందుకు జగన్ కుట్ర: యనమల - Yanamala
TDP leader Yanamala: చట్టసభల ప్రాధాన్యం తగ్గించేందుకు ముఖ్యమంత్రి జగన్ కుట్ర చేస్తున్నారని తెదేపా నేత యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏడాదికి సగటున 25 రోజులు మించి చట్టసభలు నిర్వహించడం లేదని దుయ్యబట్టారు
![Yanamala: చట్టసభల ప్రాధాన్యం తగ్గించేందుకు జగన్ కుట్ర: యనమల TDP leader Yanamala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16325950-240-16325950-1662717795421.jpg)
తెదేపా నేత యనమల
చట్టసభలో ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కును జగన్ రెడ్డి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. సుప్రంకోర్టు కూడా తప్పుపట్టినా దొడ్డి దారిన మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడుతున్నారని దుయ్యబట్టారు. కేవలం బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: