ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 14, 2020, 12:52 PM IST

ETV Bharat / city

ఐటీ దాడుల సాకుతో తెదేపాపై దుష్ప్రచారం: యనమల

ఐటీ దాడుల సాకుతో తెదేపాపై దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా నేత యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోవడం కోసం..ఎదుటివాళ్లపై దాడులు చేయడమే జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు.

tdp-leader-yanamala-comments-on-it-raids
tdp-leader-yanamala-comments-on-it-raids

ఆదాయపన్ను దాడులసాకుతో తెదేపాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 నుంచి 15మంది పీఎస్​లు, పీఏలు పని చేశారన్నారు. ప్రభుత్వం రివర్స్ టెండర్ కాంట్రాక్టు ఇచ్చిన ఇన్ ఫ్రా కంపెనీపై దాడికి, తెదేపాకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఎదుటివాళ్లపై దాడులు చేయడమే జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ 43వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసు విచారణ తుది దశకు చేరిందన్న యనమల... 4వేల కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిందన్నారు. శిక్ష తప్పదని తెలిసే విచారణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details