ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మంత్రి బొత్స ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం చేసి ఈ స్థాయికి చేరారు?' - tdp leader varla ramaiah criticise on minister botsa news

రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన.. ఏం చేసి ఈ స్థాయికి చేరారని నిలదీశారు. వైకాపా మహిళా నేత ఆత్మహత్యాయత్నానికి సీఎం జగనే కారణమని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

'మంత్రి బొత్స ఏ వ్యాపారం, ఉద్యోగం చేసి ఈ స్థాయికి చేరారు'
'మంత్రి బొత్స ఏ వ్యాపారం, ఉద్యోగం చేసి ఈ స్థాయికి చేరారు'

By

Published : Jul 20, 2020, 5:12 PM IST

హిట్లర్ మంత్రివర్గంలో గోబెల్స్ ఎలానో.. జగన్ కేబినెట్​లో మంత్రి బొత్స అలా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. మంత్రి బొత్స అసత్యవాది, అవినీతిపరుడు అని గత చరిత్ర చెబుతోందన్నారు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన బొత్స.. విజయనగర రాజుల కోటను కొనే స్థాయికి ఎలా చేరారో ఆయనే చెప్పాలని నిలదీశారు.

వోక్స్ వ్యాగన్ కంపెనీ రాష్ట్రం నుంచి తరలిపోవడానికి కారణం బొత్స అన్న వర్ల.. ఆయన కుటుంబం ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం చేసి ఈ స్థాయికి చేరిందో చెప్పాలని ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై అడుగడుగునా మంత్రి బొత్స విషం కక్కుతున్నారని ఆరోపించారు. వైకాపా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షురాలు జోనీ కుమారి ఆత్మహత్యాయత్నానికి సీఎం జగనే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సీఎంను కలవాలని విజయసాయి కాళ్లు పట్టుకునే స్థాయికి ఎందుకు దిగజార్చారన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details