ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీజీపీ ఓ పార్టీకి ఎందుకు వత్తాసు పలుకుతున్నారు: వర్ల రామయ్య - రామతీర్థం తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం వద్ద శాంతిభద్రతలు ఎందుకు అదుపు తప్పాయని ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీ సవాంగ్ ఓ పార్టీకి ఎందుకు వత్తాసు పలుకుతున్నారని నిలదీశారు.

tdp leader varla ramaiah
tdp leader varla ramaiah

By

Published : Jan 2, 2021, 4:00 PM IST

రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. డీజీపీ సవాంగ్ ఓ పార్టీకి ఎందుకు వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు పని చేసేది ప్రభుత్వ ఆధ్వరంలో కాదా అని నిలదీశారు. చంద్రబాబును రామతీర్థం కొండ దగ్గరకు వస్తున్నప్పుడే ఎందుకు ఆపలేదన్నారు. ప్రతి వివాదంలోనూ విజయసాయిరెడ్డి ఎందుకు తలదూరుస్తున్నారని దుయ్యబట్టారు.

నిత్యం చంద్రబాబును అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. రామతీర్థం వద్ద శాంతిభద్రతలు ఎందుకు అదుపు తప్పాయని? ఆక్షేపించారు. ఏ పని చేయొచ్చో.. చేయకూడదో సీఎంకు డీజీపీ చెప్పాలని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

రామతీర్థంలో విజయసాయిరెడ్డికి ఏం పని? విశాఖ చుట్టుపక్కల ప్రతి వివాదంలో ఆయన జోక్యం ఎందుకు? మంత్రులు, ఎమ్మెల్యేలను కాదని విజయసాయి అతిప్రవర్తన దేనికి సంకేతం? రామతీర్థం వెళ్తున్నట్లు డీజీపీకి జనవరి 1న చంద్రబాబు పీఎస్ లేఖ పంపారు. ఎన్​ఎస్​జీ సెక్యూరిటీ ఉండే చంద్రబాబు కార్లు అన్ని వెళ్లకుండా ఎలా ఆపారు..?- వర్ల రామయ్య, తెదేపా సీనియర్ నేత

ఇదీ చదవండి

రణరంగంగా రామతీర్థం...విజయ సాయిరెడ్డికి నిరసన సెగ

ABOUT THE AUTHOR

...view details