ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 10, 2020, 3:54 PM IST

ETV Bharat / city

'ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయింది'

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ వ్యవహారంలో సుప్రీం తీర్పుతో ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి అన్నారు. రాజ్యాంగ సంస్థల విషయంలో నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే భంగపాటు తప్పదని మరోసారి రుజువైనట్లు ఆయన స్పష్టం చేశారు.

'ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయింది'
'ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయింది'

సోమిరెడ్డి ట్వీట్​

ఎస్​ఈసీ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకంలోకి నెట్టిందని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషనర్​ రమేశ్​కుమార్​ విషయంలో ప్రభుత్వ వాదన నమ్మదగినదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఇది స్పష్టమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలతో ఆటలాడవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించటంతోనే ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details