ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉక్కు పరిశ్రమలో భూములు అమ్మడానికి సీఎం జగన్‌ ఎవరు?' - privatization of vishaka steel plant

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా అన్నిపార్టీలు కలిసి పోరాడాలని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. కర్మాగారం భూములు అమ్మడానికి సీఎం జగన్‌ ఎవరని ప్రశ్నించారు.

tdp leader pattabhi
tdp leader pattabhi

By

Published : Feb 19, 2021, 1:28 PM IST

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి

విశాఖ ఉక్కు కర్మాగారం భూములు అమ్మడానికి సీఎం జగన్‌ ఎవరని.. తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ప్రశ్నించారు. 32 మంది ప్రాణత్యాగం చేసి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సాధిస్తే.. ఇప్పుడు భూములు అమ్ముతారా అని నిలదీశారు.

పోస్కో కంపెనీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి రాలేదని చెబుతున్న సీఎం జగన్‌.. డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. రాజ్యసభలో వైకాపా ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పష్టంగా సమాధానం చెప్పారని గుర్తు చేశారు. అందరం రాజీనామా చేసి కలిసి పోరాడుదామని హితవు పలికారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details