ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 11, 2021, 12:33 PM IST

ETV Bharat / city

'ఎక్కడా లేని విధంగా మరో అడ్వకేట్‌ జనరల్‌ ఎందుకు..?'

సీఎం జగన్‌పై తెదేపా నేత పట్టాభి రామ్‌ విరుచుకుపడ్డారు. అదనపు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ను నియమించడంపై ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మరో అడ్వకేట్‌ జనరల్‌ ఎందుకని నిలదీశారు.

tdp leader pattabhi comments on AAG  jasthi nagabushanam
tdp leader pattabhi comments on AAG jasthi nagabushanam

సీఎం జగన్‌ రాజకీయాలు మాని ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టాలని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి విమర్శించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అదనపు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ను నియమించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఏ అర్హత లేని జాస్తి నాగభూషణాన్ని సీఎం జగన్​ ఎందుకు నియామించారని నిలదీశారు.

గత సంప్రదాయాలకు విరుద్ధంగా రెండో అదనపు అడ్వకేట్ జనరల్​గా ఎలాంటి అనుభవం, హైకోర్టులో కనీసం వకాల్​తాలు దాఖలు చేయని జాస్తి నాగభూషణంను గత ఏడాది డిసెంబర్​లో ప్రత్యేక జీవో ద్వారా నియమించారని విమర్శించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు కాబట్టే జాస్తి నాగభూషణానికి ఏజీ కంటే అదనంగా ప్రత్యేక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details