ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh on HC Verdict: వైకాపా మూడు ముక్కలాటకు చెంపపెట్టు హైకోర్టు తీర్పు - నారా లోకేశ్ - amaravati latest news

Lokesh on HC Verdict: వైకాపా సర్కారు విద్వేషపూరిత ఆలోచనలతో తలపెట్టిన మూడు ముక్కలాటకు హైకోర్టు తీర్పు చెంపపెట్టని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రజా రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన‌ రైతుల విజయం ఇదని ఆయన అన్నారు.

Lokesh on HC Verdict
అమరావతిపై హైకోర్టు తీర్పుపై లోకేశ్

By

Published : Mar 3, 2022, 3:52 PM IST

Updated : Mar 3, 2022, 8:41 PM IST

Lokesh on HC Verdict: వైకాపా సర్కారు విద్వేషపు ఆలోచనలతో తలపెట్టిన మూడు ముక్కలాటకి హైకోర్టు తీర్పు చెంపపెట్టన్నారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌. ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు భూములు త్యాగం చేశారని గుర్తుచేశారు. వారందరి విజయమే ఈ తీర్పని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ ముద్దు.. రాజధాని వికేంద్రీకరణ వద్దు.. అనే నినాదంతో అమరావతి ప్రాంత ప్రజలు సాగించిన నిస్వార్థ ఉద్యమానికి ఇది ఫలితమన్నారు. సర్కారు అరెస్టులు, నిర్బంధాలు, దాడులకు ఎదురు నిలిచి శాంతియుత ఉద్యమంతో విజయం సాధించిన రైతులు, మహిళలు, విద్యార్థులు, రైతు కూలీలు, మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలకు ఆయన ఉద్యమాభివందనాలు తెలిపారు. అమరావతి అజరామరమని లోకేశ్‌ అన్నారు. అమరావతిని కూల్చాలని, తరలించాలని దురాలోచనలు మానేయాలని సూచించారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇకపై అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తే చరిత్రలో నిలుస్తుందని హితవు పలికారు.

క్షమాపణ చెప్పేంత వరకు చట్టసభలకు బంద్​..

తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు వైకాపా ప్రజాప్రతినిధులు క్షమాపణ చెప్పేంత వరకు శాసనసభకు వచ్చే అవకాశం లేదని నారాలోకేశ్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెదేపాదే విజయమన్నారు. వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ హస్తం ఉందని స్పష్టమైందన్నారు. ఇందులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో వారి వివరాలన్ని త్వరలోనే బయటకు వస్తాయన్నారు. మాజీ డీజీపీ రాసిన లేఖకు అర్థముందా? అని ప్రశ్నించారు. అన్ని చట్టాలు ఉల్లంఘించిన గౌతమ్ సవాంగ్ తగిన మూల్యం చెల్లించుకునే సమయం వస్తోందన్నారు.

ఇదీ చదవండి : TDP on Amaravati: వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలి: తెదేపా

Last Updated : Mar 3, 2022, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details