ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శనగ విత్తనాల సబ్సిడీ తగ్గించడం సరికాదు: మల్లెల లింగారెడ్డి

శనగ విత్తనాల పంపిణీలో రైతులకు అన్యాయం జరుగుతోందని తెదేపా నేత మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. ఆయన వ్యయసాయశాఖ మంత్రి కన్నబాబుకు లేఖ రాశారు. రైతు భరోసా కేంద్రాల్లో శనగ విత్తనాలను గతంలో 50 శాతం సబ్సిడీకి విత్తనాలు పంపిణీ చేశారన్నారు. ప్రస్తుతం ఆ సబ్సిడీని 30 శాతానికి తగ్గించారని, రైతులు నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు.

By

Published : Oct 14, 2020, 7:08 PM IST

మల్లెల లింగారెడ్డి
మల్లెల లింగారెడ్డి

శనగ విత్తనాల పంపిణీలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ... తెదేపా నేత మల్లెల లింగారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు లేఖ రాశారు. విత్తనాలపై గతంలో ఉన్న 50 శాతం సబ్సిడీని 30 శాతానికి తగ్గించటం వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

మార్కెట్ ధరతో సమానంగా రైతు భరోసా కేంద్రాల్లో రూ.5250కి విక్రయించటం విడ్డూరమని అభ్యంతరం వ్యక్తం చేశారు. 50 శాతం సబ్సిడీతో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని లింగారెడ్డి.. మంత్రి కన్నబాబును లేఖలో డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details