కొవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కరోనాకు చికిత్స పొందుతూ.. సరిపడా ఆక్సిజన్ అందక విజయనగరంలోని ఆస్పత్రిలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ను నల్లబజారులో అమ్ముతున్న కంపెనీలపై చర్యలు తీసుకోకపోవటంపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు - chandrababu naidu critics on government news
విజయనగరంలోని ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
తెదేపా అధినేత చంద్రబాబు