ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 26, 2021, 12:54 PM IST

ETV Bharat / city

ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు

విజయనగరంలోని ఆస్పత్రిలో ఆక్సిజన్​ అందక మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

chandrababu naidu
తెదేపా అధినేత చంద్రబాబు

కొవిడ్​ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కరోనాకు చికిత్స పొందుతూ.. సరిపడా ఆక్సిజన్​ అందక విజయనగరంలోని ఆస్పత్రిలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. ఆక్సిజన్‌ను నల్లబజారులో అమ్ముతున్న కంపెనీలపై చర్యలు తీసుకోకపోవటంపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details