ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 23, 2020, 5:23 PM IST

ETV Bharat / city

తెదేపా మహానాడు: కార్యకర్తలకు ఈ-ఆహ్వానాలు

‘తెదేపా మహానాడు’ కార్యక్రమాన్ని ఈ నెల 27, 28 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మేరకు కార్యక్రమంలో పాల్గొనే వారికి పార్టీ అధినేత చంద్రబాబు ఈ-ఆహ్వానాన్ని పంపారు.

mahanadu
mahanadu

తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఈ నెల 27, 28 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈసారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న ఈ వేడుకకు అధినేత చంద్రబాబు కార్యకర్తలందరికీ ఈ-ఆహ్వానాన్ని పంపారు. కార్యకర్తలంతా జూమ్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడంతోపాటు మహానాడుకు నమోదు కావాల్సిన తీరును ఆహ్వానంలో వివరించారు. కార్యక్రమాల షెడ్యూల్‌, తీర్మానాల్ని దాదాపు ఖరారు చేశారు. మొత్తం 13 తీర్మానాలు మహానాడు వేదికగా ప్రవేశపెట్టాలని తెలుగుదేశం యోచిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details