ఆంధ్రప్రదేశ్

andhra pradesh

న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని ఖండించాలి: చంద్రబాబు

By

Published : Jul 17, 2020, 2:07 AM IST

Updated : Jul 17, 2020, 2:22 AM IST

న్యాయమూర్తి రామకృష్ణపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విటర్​లో పేర్కొన్నారు.

tdp chief chandrababu
tdp chief chandrababu

చంద్రబాబు ట్వీట్

న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. 'వైకాపా గూండాలు దళితుల అసైన్డ్ భూములు లాక్కుంటుంటే బాధిత దళిత కుటుంబాల వైపు నిలవడమే ఆయన చేసిన తప్పు. మాజీ ఎంపీ హర్షకుమార్, వైద్యులు సుధాకర్. అణనితారాణి, మహాసేన రాజేశ్​లపై జరిగినట్లే... దళితులపై వేధింపులకు ఇది మరో నిదర్శనం. ఈ అన్యాయాలను దళిత సంఘాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలి'అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Last Updated : Jul 17, 2020, 2:22 AM IST

ABOUT THE AUTHOR

...view details