ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ

By

Published : Jan 24, 2020, 12:09 PM IST

Updated : Jan 24, 2020, 1:03 PM IST

Supreme Court
Supreme Court

12:02 January 24

విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ

తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.జస్టిస్‌ ధర్మాధికారి నివేదికను సవాలు చేస్తూఏపీ డిస్కంలు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం....డిస్కంల అభ్యంతరాలను పరిశీలించాలని జస్టిస్‌ ధర్మాధికారి కమిటీకి సూచించింది. 2వారాల్లోగా తమ అభ్యంతరాలను కమిటీ ముందుకు తీసుకెళ్లాలని డిస్కంలను ఆదేశించింది. కమిటీ కేటాయింపులు పక్కన పెట్టాలన్న ఏపీ డిస్కంల వాదనలను తోసిపుచ్చింది.విభజన చట్టం ప్రకారం52-48నిష్పత్తిలో ఉద్యోగులను విభజించాలని ఏపీ డిస్కంలు వాదించాయి.655మంది ఉద్యోగులను కేటాయించడం ఆమోదయోగ్యం కాదన్న ఏపీ డిస్కంలు...తమపై భారం పడుతోందని వాదించాయి.తాము ఆరేళ్లుగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చామని తెలంగాణ తరఫు న్యాయవాది తెలిపారు.జీతాలు ఎవరు అందచేయాలనే అంశంపై కమిటీ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది.

Last Updated : Jan 24, 2020, 1:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details