ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ విద్యుత్​ సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన విషయంపై ఈ నోటీసులు పంపనున్నట్లు తెలిపింది.

By

Published : Jun 29, 2021, 4:07 PM IST

Supreme Court Notices
సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ధిక్కరణ నోటీసులు పంపింది. విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వట్లేదంటూ... 84మంది ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1,150 మంది ఉద్యోగులను 2 రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పంపిణీ చేయగా... ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం 655 మందిని ఏపీ ప్రభుత్వం చేర్చుకున్నట్లు చెప్పారు.

84 మందిని మినహాయించి మిగిలిన వారిని తెలంగాణ ప్రభుత్వం చేర్చుకోగా... వీరంతా ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు... జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో పాటు... ఎస్పీడీసీఎల్​ (SPDCL) సీఎండీ రఘుమారెడ్డి, కార్పొరేట్‌ కార్యాలయ అధికారి గోపాలరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను జులై 16కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details