ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 18, 2020, 5:08 AM IST

ETV Bharat / city

విద్యుత్​ ఉద్యోగుల పంపకాల కేసు..వాయిదా వేసిన సుప్రీం

రెండు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై దాఖలైన కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఉద్యోగుల విభజన విషయంలో మరో కమిటీని నియమించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.  సమస్య పరిష్కారం కోసమే కమిటీని నియమించామని...ఇంకో కమిటీ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది.

suprem-court-postponed-to-the-electricity-employess-biffercation-case
suprem-court-postponed-to-the-electricity-employess-biffercation-case


రెండు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై దాఖలైన కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఉద్యోగుల విభజన విషయంలో మరో కమిటీని నియమించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ ధర్మాధికారి నివేదికను సవాల్‌ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలు, విద్యుత్‌ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం... సమస్య పరిష్కారం కోసమే కమిటిని నియమించామని, ఇంకో కమిటి ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది.

స్థానికత ఆధారంగా ఉద్యోగుల నియామకం జరగాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 52, 48 నిష్పత్తిలో ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంటే.. అలా కాకుండా 655 మంది ఉద్యోగులను ఏపీకి కేటాయించడం ఆమోదయోగ్యం కాదని ఏపీ డిస్కంల తరపు న్యాయవాది నీరజ్‌ కౌషల్‌ కోర్టుకు వివరించారు. తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగులను ఏపీకి కేటాయించారని, అదే ఏపీలో పని చేస్తున్న వారిని ఒక్కరిని కూడా తెలంగాణకు కేటాయించలేదన్నారు. ఉద్యోగుల సంఖ్య పెరగడంలో తమకు భారం పెరుగుతుందని.. జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ విధి విధానాల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. కమిటి నివేదిక ఆమోదయోగ్యమో కాదో స్పష్టంగా చెప్పాలని డిస్కంల న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి సమాధానం ఇచ్చిన న్యాయవాది.. కమిటి నివేదిక ఆమోదయోగ్యమేనంటూనే... ఏపీకి కేటాయించిన ఉద్యోగుల విషయాన్నే తాము ప్రస్తావిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు అందించేందుకు వారం రోజులు గడువు కావాలని కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్‌ ఉపసంహరించుకుని.. మరో పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది. తాము రిలీవ్‌ చేసిన ఉద్యోగులను ఏపీ డిస్కంలు చేర్చుకోవడం లేదని, అందువల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, వారి వేతనాల చెల్లింపుపై కూడా స్పష్టత కరువైందని తెలంగాణ డిస్కంల న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు... అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం కేసు విచారణ వారం రోజులు వాయిదా వేసింది.

ఇదీ చదవండి : నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర

ABOUT THE AUTHOR

...view details