ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

STUDENTS PROTEST: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ఆందోళన

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విదార్థులు కదం తొక్కారు. ఎస్​ఎఫ్ఐ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు.. కలెక్టర్‌ బయటకు వచ్చి సమస్యలు వినాలంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ల వద్ద పెద్దఎత్తున మోహరించిన పోలీసులు.. విద్యార్థులు లోనికి వెళ్లకుండా అడ్డగించారు.

By

Published : Oct 8, 2021, 5:56 PM IST

students protest at  district magistrates demanding to solve their problems
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. ఎయిడెడ్‌ కళాశాలల ప్రైవేటీకరణ, ఉపకార వేతనాల మంజూరు సమస్యలపై నిరసనలు చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. బారికేడ్లు తోసుకుని కొందరు విద్యార్థులు కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు పక్కకు నెట్టివేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు.. జిల్లా కలెక్టర్‌ బయటకు వచ్చి తమ సమస్యలు వినాలంటూ నినాదాలు చేశారు. విజయనగరం, గుంటూరులోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

గుంటూరు జిల్లాలో..

ఎయిడెడ్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. గుంటూరులో ఎస్​ఎఫ్​ఐ నేతలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్​కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని.. పలువురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం అంటే పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనని విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వం ఈ దుర్మార్గపు చర్యలను వెంటనే మానుకోకపోతే.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే జీవో నెంబర్ 42ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లాలో..

జీవో నెంబర్ 77, 44 రద్దు చెయ్యాలని ఎస్​ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు.. కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను.. ప్రైవేటీకరణ చేయకూడదని వారు డిమాండ్ చేశారు. తెలుగు మీడియంను కొనసాగించి విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ..విద్యార్థులు నిరసన తెలిపారు.


ఇదీ చదవండి:

PAWANKALYAN ON TWITTER: సీఎం జగన్ పై.. పవన్ 'సోషల్' వార్! మరో సంచలన ట్వీట్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details