ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న పార్టీ శ్రేణులు - state wide celebrations of ysr congress party formation day news

వైకాపా ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించి... శ్రేణులతో కలసి నాయకులు... సంబరాలు చేసుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేతలు చెప్పారు.

ycp formation day
రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఆవిర్భావ వేడుకలు

By

Published : Mar 12, 2021, 8:13 PM IST

తాడేపల్లిలోని వైకాపా కేంద్రకార్యాలయంలో ఆ పార్టీ పదో ఆవిర్భావ వేడుక జరిగింది. వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. వైఎస్సార్​ విగ్రహానికి నివాళులు అర్పించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. చీరలు పంపిణీ చేశారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకున్న ఘనత జగన్‌దేనని కొనియాడారు.

శ్రీకాకుళం వైకాపా కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొని...కలసికట్టుగా పనిచేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాశీబుగ్గలో మంత్రి అప్పలరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైఎస్సార్​ విగ్రహానికి నివాళులర్పించారు. ఏలూరులో మంత్రి ఆళ్లనాని వైకాపా జెండాను ఆవిష్కరించారు. తాడికొండ , రంపచోడవరం, మాడుగుల, పి.గన్నవరంలోనూ వేడుకలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన.. వైకాపాలో వర్గ విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సమక్షంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి.

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వైకాపా బలోపేతానికి కృషి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలోని తన నివాసంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలసి పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతపురంలో మంత్రి శంకర్ నారాయణ, రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పులివెందులలో ఎంపీ వైఎస్‌ అవినాశ్​ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు.

వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బి.వై రామయ్య వైఎస్సార్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పురపోరులో తప్పనిసరిగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ డా.బీవీ సత్యవతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైకాపాను స్థాపించి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఉబలంక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న కొవిడ్ వాక్సినేషన్ వేస్తున్న తీరును పరిశీలించారు. స్థానిక కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్స్ పంచారు. రంపచోడవరంలో మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్న దొర తోపాటు సర్పంచి మంగా బొజ్జయ్య తదితరులు వైఎస్సార్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు.

అనంతపురం జిల్లా మడకశిర మండలం కదిరేపల్లి గ్రామంలో జరిగిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావానికి జగన్ ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. నెల్లూరులో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఆవిర్భావ వేడుకలు

ఇదీ చదవండి:కేటీఆర్‌ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ABOUT THE AUTHOR

...view details