ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా ఖరారు

By

Published : Jan 15, 2021, 2:57 PM IST

Updated : Jan 15, 2021, 4:19 PM IST

రాష్ట్రంలో నమోదైన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4 కోట్ల 4 లక్షల 41 వేల 378 ఓటర్లు ఉన్నట్టు ఈసీ తెలియజేసింది. గత ఏడాదితో పోలిస్తే కొత్తగా 4 లక్షల 25 వేల 860 ఓటర్లు నమోదు అయినట్లు స్పష్టం చేసింది. మొత్తంగా 1.06 శాతం మంది ఓటర్లు పెరిగారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ వెల్లడించారు.

voters list finalized in ap
ఓటర్ల తుది జాబితా ప్రకటన

ఆంధ్రప్రదేశ్​లో నమోదైన ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4 కోట్ల 4 లక్షల 41 వేల 378 ఓటర్లు ఉన్నట్టు తెలిపింది.

మహిళ ఓటర్లు 2 కోట్ల 4 లక్షల 71 వేల 506 మంది ఉండగా.. 1 కోటి 99 లక్షల 66 వేల 737 మంది పురుష ఓటర్లుఉన్నారు.సర్వీసు ఓటర్లు 66 వేల 844 మంది ఉన్నట్టు ఈసీ తెలిపింది. ధర్డ్ జెండర్ ఓటర్లు 4,135 మందిగా నమోదయ్యారు. కొత్తగా 4 లక్షల 25 వేల 860 మంది ఓటర్లు 2021 జనవరి నాటికి పెరిగారని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 1500 మంది ఓటర్ల చొప్పున నమోదు అయ్యారనీ.. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల 917 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది.

ఎన్నికల జాబితాపై అభ్యంతరాల పరిశీలన అనంతరం 63 వేల 507 ఓట్లు తొలగించినట్టు ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో నమోదైన ఓటర్ల తుది జాబితాను సీఈఓ ఆంధ్రా వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు ఈసీ వెల్లడించింది.

ఇదీ చదవండి:రుణ యాప్​లపై కేంద్రం, ఆర్​బీఐకి నోటీసులు

Last Updated : Jan 15, 2021, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details