కొవిడ్ దృష్ట్యా నూతన సంవత్సర ప్రారంభ వేడుకలను దూరం పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు గుమిగూడకుండా పలు ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఇంట్లోనే వేడుకలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే సహించబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమకు సహకరించాలని ప్రజలను కోరుతున్నారు.
కొత్త రకం కరోనా వ్యాప్తి క్రమంలో వేడుకలను ఇంట్లో జరుపుకోవాలని విజయవాడ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. హోటళ్లు, పబ్బులు, ఫంక్షన్ హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో వేడుకల నిర్వహణకు అనుమతి లేదు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నిర్ణీత సమయం వరకే ఉంటాయి. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో యధావిధిగా పూజలు, ప్రార్థనలు చేసుకోవచ్చు- బి .శ్రీనివాసులు, విజయవాడ పోలీస్ కమిషనర్
డిసెంబర్ 31న రాత్రి పది గంటల తర్వాత కర్నూలులోని దుకాణాలన్నీ మూసివేయాలి. రోడ్లపై కేకులు కోయడం, బాణసంచా కాల్చడం నిషిద్ధం. ఇవాళ నగరంలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తాం- కేవీ మహేష్, కర్నూలు డీఎస్పీ