నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణకు ఉత్తర్వులు జారీ - రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ప్రభుత్వ మార్గదర్శకాలు
నవంబర్ 1వ తేదీన ఏపీ అవతరణ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్...తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం మంత్రులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు, మంత్రులు, కలెక్టర్లు రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

అనంతరం సీఎం.. మంత్రులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు, మంత్రులు, జిల్లా కలెక్టర్లు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్భవన్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దిల్లీలోని ఏపీ భవన్లో కూడా రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి.
ఇదీ చదవండి :కొత్త వైద్య కళాశాలలకు జనవరి 16లోగా టెండర్లు పూర్తి చేయాలి: సీఎం