ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పది పరీక్ష కేంద్రాల్లో మార్పులు! - ఏపీ ఎస్ఎస్​స్ పరీక్షలు తాజా న్యూస్

కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడిన పది పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. విద్యార్థుల ఇంటికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలు ఉండేందుకు కసరత్తులు చేస్తోంది.

ssc exams  centers
పది పరీక్ష కేంద్రాల్లో మార్పులు

By

Published : May 18, 2020, 7:20 AM IST

కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్ష కేంద్రాల కేటాయింపులో ప్రభుత్వం నూతన విధానాన్ని పాటించబోతుంది. విద్యార్థి నివాస ప్రాంతానికి సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది.

పట్టణాలు, నగరాల్లో వసతిగృహాల్లో ఉండి పదో తరగతి చదివిన విద్యార్థులు లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లారు. చదివిన పాఠశాల ప్రకారం కేంద్రాలను కేటాయిస్తే వారంతా తిరిగి వచ్చి వారం పాటు ఉండాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వారి నివాసానికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాలని భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details