ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్రహణం పట్టని ఆలయం: శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న దర్శనాలు

By

Published : Jun 21, 2020, 11:22 AM IST

Updated : Jun 21, 2020, 11:55 AM IST

సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం వస్తే ప్రపంచంలోని అన్ని దేవాలయాలు దాదాపు మూసివేస్తారు. కానీ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాత్రం దర్శనాలు కొనసాగుతున్నాయి.

srikalahasti temple
srikalahasti temple

శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న దర్శనాలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. స్వామి, అమ్మవార్లకు గ్రహణకాల అభిషేకాలు చేశారు. రాహు,కేతు పూజలను నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఆలయం లోపల ఊరేగించారు.

ఆలయ దర్శనానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ ఆదిదంపతులను దర్శించుకుంటున్నారు. సూర్యగ్రహణంతో దేశంలోని ఆలయాలన్నీ మూతపడినా.. గ్రహణ గండాలకు అతీతమైన శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని మాత్రం.. ఎప్పటిమాదిరే తెరిచి ఉంచారు.

Last Updated : Jun 21, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details