ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాశీ: భక్తుల సేవలో శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం - varanasi latest news updates

కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని ప్రతి హిందువు విశ్వాసం. అత్యంత పుణ్యప్రదమైన కాశీయాత్రకు వెళ్లే తెలుగువారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది... వారణాశిలోని శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం. కరోనా కాలంలోనూ నిత్యం ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తుల సేవలో తరిస్తోంది.

Sri Rama Taraka Andhra Ashram in the service of devotees in lockdown in varanasi
భక్తుల సేవలో శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం

By

Published : May 27, 2020, 11:42 AM IST

తెలుగు రాష్ట్రాల నుంచి కాశీ యాత్రకు వచ్చే భక్తులకు వసతి, ఆహార సౌకర్యాలను కల్పిస్తూ కాశీ విశ్వేరుడి సన్నిధిలో 60 ఏళ్లుగా సేవలందిస్తోంది శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం. లాక్​డౌన్​ కారణంగా ఆకలితో బాధ పడుతున్న వృద్ధులు, సాధువులకు ఇక్కడ నిత్యాన్నదానం చేస్తున్నారు. పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

కరోనా వ్యాప్తి త్వరగా తగ్గి ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కాశీ విశ్వేరుడిని ప్రార్థిస్తూ చండీ సహిత రుద్రహోమం చేశారు. ప్రతి శనివారం 11 సార్లు హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తున్నారు. కరోనా సంక్షోభం తమ ఆశ్రమంపైనా పడిందని... సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా ఉందని ఆశ్రమ ట్రస్టీ సుందర శాస్త్రి తెలిపారు. ఆశ్రమంలో వసతి సౌకర్యాలను నిలిపివేశారు.

భక్తుల సౌకర్యార్థం ఆశ్రమంలో ఉన్న శివాలయం, రామాలయం, కృష్ణ మందిరాల్లో పూజా కార్యక్రమాలు వారి గోత్రనామాలతో నిర్వహిస్తున్నారు. పూజల నిమిత్తం దాతల నుంచి విరాళాలు కోరుతున్నామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనా రికవరీలో తెలుగు రాష్ట్రాలు భేష్‌

ABOUT THE AUTHOR

...view details