రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ర్యాపిడ్ టెస్టులను అందుబాటులోకి తీసుకొస్తే... మరింత ఎక్కువ మందిని తక్కువ సమయంలో పరీక్షించగలుగుతామంటున్నారు. భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ల వినియోగమే కరోనా విముక్తి దిశగా ప్రస్తుతం మనకున్న తారకమంత్రం అంటున్న కోవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధాకర్తో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.
'ర్యాపిడ్ టెస్టుల ద్వారా ఎక్కువ మందికి పరీక్షలు' - latest corona precautions in andhra'
లాక్డౌన్ను అందరూ తప్పకుండా పాటించాలని కోవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధాకర్ అన్నారు. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నవారికి కరోనా సోకే అవకాశాలు తక్కువని... 50 ఏళ్లు పైబడ్డవారు, ఆరోగ్య సమస్యలున్న వారికి కరోనా ముప్పు ఎక్కువే అని చెప్పారు. ర్యాపిడ్ టెస్టుల ద్వారా ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే వీలుందంటన్నారు.
'ర్యాపిడ్ టెస్టుల ద్వారా ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే వీలు'