ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 23, 2022, 4:16 PM IST

ETV Bharat / city

క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాలు.. రాగల 4 రోజులు అక్కడ భారీ వర్షాలు

Rains: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు అత్యంత క్రియాశీలంకంగా ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.

దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు అత్యంత క్రియాశీలంకంగా ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఇవి రాజస్థాన్‌లోని జైసల్మేర్ కోట నుంచి ఒడిశాలోని గోపాల్​పూర్ వరకూ విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఒడిశా, చత్తీస్​గఢ్ నుంచి బంగాళాఖాతం వరకూ వేర్వేరు ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్​గడ్ రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 4 రోజుల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details