ఐటీ సోదాల విషయంలో వైకాపా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ముద్దాయిల పార్టీ కాబట్టి అందరూ ముద్దాయిలే కావాలన్నదే వారి కోరికంటూ మండిపడ్డారు. కక్షల గురించి కాకుండా రాష్ట్ర భవిత గురించి ఆలోచించే వారే నిజమైన నాయకుడంటూ హితవు పలికారు.
'వైకాపా తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది'
ఐటీ సోదాలపై వెలుగులోకి వచ్చిన పంచనామా నివేదికపై తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో వైకాపా తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందంటూ ట్వీట్ చేశారు.
somireddy comments on it raids